దుర్గగుడి వెండి విగ్రహాల చోరీ కేసు నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-23T22:46:01+05:30 IST

దుర్గగుడి వెండిసింహాల చోరీ కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ 17న 3 వెండి సింహాల విగ్రహాలను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేసిన..

దుర్గగుడి వెండి విగ్రహాల చోరీ కేసు నిందితుల అరెస్ట్

విజయవాడ: దుర్గగుడి వెండిసింహాల చోరీ కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ 17న 3 వెండి సింహాల విగ్రహాలను ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు..  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాయిబాబా, బంగారం వ్యాపారి కమలేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 కిలోల వెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇతర ఆలయాల్లో చోరీ చేసిన 6.4కిలోల వెండి దిమ్మెలను కూడా  స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-23T22:46:01+05:30 IST