విజయవాడ కోవిడ్ సెంటర్లో మృతి చెందినది వీరే...
ABN , First Publish Date - 2020-08-09T18:29:08+05:30 IST
విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
విజయవాడ : విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. ఇప్పటి వరకూ 10మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 50 మంది ఉన్నట్లు తెలియవచ్చింది. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్, కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో మృతులు..
01. డోక్కు శివ బ్రహ్మయ్య (58), మచిలీపట్నం
02. పూర్ణ చంద్ర రావు మొవ్వ
03. సుంకర బాబు రావు (రిటైర్డ్ ఎస్సై), సింగ్ నగర్
04. మజ్జి గోపి (మచిలీపట్నం)
05. సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు
06. వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి) కందుకూరు
07. వెంకట లక్ష్మి సువర్చలా దేవీ (కందుకూరు)
08. ఎం. రమేష్ (విజయవాడ)
09. పవన్ కిషన్ (కందుకూరు)
10. అబ్రహం చర్చి ఫాదర్ (జగ్గయ్యపేట)
ఇంకా ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. కాగా ఈ పది మంది మృతదేహాల పోస్టుమార్టం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించున్నారు. మరోవైపు.. బెజవాడ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమాన్యాలపై బెజవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హోటల్, ఆసుపత్రి రెండింటిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.