పోలీసుల వలయంలో Vijayawada రైల్వే స్టేషన్
ABN , First Publish Date - 2022-06-18T15:12:12+05:30 IST
విజయవాడ రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలు పోలీసుల వలయంలోకి వెళ్లిపోయాయి.
విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలు పోలీసుల వలయంలోకి వెళ్లిపోయాయి. రైల్వే స్టేషన్ ఐదు ఎంట్రీ గేట్ల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. టికెట్లు లేని ప్రయాణికులు రైల్వే స్టేషన్లోకి అనుమతించేందుకు రైల్వే అధికారులు నిరాకరిస్తున్నారు. రైల్వే ట్రాక్లపై నిరంతరం రైల్వే భద్రత అధికారుల పర్యవేక్షణ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన మెసేజ్లతో రైల్వే, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.