AP: రాధాపై బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-08T17:31:36+05:30 IST

టీడీపీ నేత వంగవీటి రాధాపై ఆ పార్టీ నేత బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

AP: రాధాపై బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడ: టీడీపీ నేత వంగవీటి రాధాపై ఆ పార్టీ నేత బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరుపై రాధా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో తెలియదన్నారు. ‘‘మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు మంచి సంబంధాలు ఉన్నాయి. డిసెంబరు 26న వాళ్లంతా కలిసి కార్యక్రమాలు చేశారు. నాని, వంశీలు ఉద్యమం చేయనక్కర్లేదు... వాళ్ల నాయకుడికి ఒక్క మాట చెబితే చాలు. రాధా ఆవైపు ప్రయత్నం చేస్తున్నారేమో నేను చెప్పలేను. రేపు నేను చేపట్టే దీక్షకు కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ తరలి రావాలి. మీడియా ద్వారా అందరికీ ఇదే నా ఆహ్వానం. రంగా అభిమానులు అందరూ దీక్షలో పాల్గొనాలి’’ అంటూ బోండా ఉమా పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-02-08T17:31:36+05:30 IST