కృష్ణా జిల్లాలో రెండోరోజు జోరుగా కోడి పందాలు
ABN , First Publish Date - 2022-01-15T17:58:53+05:30 IST
కృష్ణా జిల్లాలో రెండో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి.
విజయవాడ: కృష్ణా జిల్లాలో రెండో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందాలతో పేకాట, గ్యాంబ్లింగ్, గుడుంబా ఆటలు జోరుగా జరుగుతున్నప్పటికీ పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ రంగులతో కోడి పందాల శిబిరాలను ఏర్పాటు చేశారు. కోడి పందాలు, పేకాట ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.