Gannavaram ఎయిర్పోర్టుకు చేరుకున్న నీతి ఆయోగ్ బృందం
ABN , First Publish Date - 2021-12-01T14:14:49+05:30 IST
నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ బృందం బుధవారం ఉదయం గన్నవర్ ఎయిర్పోర్టుకు చేరుకుంది.
విజయవాడ: నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ బృందం బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బృందం విజయవాడకు చేరుకుంది. గన్నవరం ఎయిర్ పోర్ట్లో రాజ్ కుమార్ బృందానికి జిల్లా కలెక్టర్ నివాస్, అగ్రికల్చర్ ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలోని లాంజ్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బృందం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన బృందం గన్నవరం మండలం వీరపనేనిగూడెం బయలుదేరారు.