వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి వచ్చిన మహిళలకు చుక్కెదురు
ABN , First Publish Date - 2021-10-07T17:26:13+05:30 IST
కృష్ణా జిల్లా గన్నవరం బాయ్స్ హై స్కూల్ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలకు చుక్కెదురైంది.
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం బాయ్స్ హై స్కూల్ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలకు చుక్కెదురైంది. ఆసరా సభ వద్ద ఎటువంటి వసతులు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సభా ప్రాంగణం మొత్తం బురదతో ఉండడంతో మహిళలు ఇండ్లలకు తిరుగు ప్రయాణమయ్యారు. సభ వద్ద సదుపాయాలు లేకపోవడంతో మహిళలు మండుటెండలో కూర్చున్నారు. వైఎస్సార్ ఆసరాకు వచ్చిన మహిళలు ఎండ ప్రభావం తట్టుకోలేక చెట్ల కింద రాళ్లపై కూర్చున్నారు.