AP: బంగారం స్మగ్లింగ్ కేసులో రైల్వే టీటీఐ సస్పెండ్

ABN , First Publish Date - 2021-09-30T18:14:35+05:30 IST

బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రైల్వే టీటీఐ ఆకుల రాఘవేంద్రరావుపై సస్పెన్షన్ వేటు పడింది.

AP: బంగారం స్మగ్లింగ్ కేసులో రైల్వే టీటీఐ సస్పెండ్

విజయవాడ: బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రైల్వే టీటీఐ ఆకుల రాఘవేంద్రరావుపై సస్పెన్షన్ వేటు పడింది. రాఘవేంద్రరావుతో పాటు మరో ముగ్గురు రైల్వే అధికారులను రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ రైల్వేలోని పలువురి ఉద్యోగుల నుండి కోట్లలో వసూళ్లకు పాల్పడిన ఓ మహిళాతో పాటు నలుగురు రైల్వే ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 22న ఆకుల రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా రైల్వే అధికారులతో పాటు రాఘవేంద్రరావుని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు.

Updated Date - 2021-09-30T18:14:35+05:30 IST