Vijayawada: విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-05-14T16:08:34+05:30 IST

నగరంలోని విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.

Vijayawada: విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తం

విజయవాడ: నగరంలోని విద్యార్థి సంఘాల రాజ్ భవన్(Raj Bhavan) ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గాంధీ నగర్ అలంకార్ సెంటర్ వద్ద విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం.. తోపులాట జరిగింది. చివరకు విద్యార్థి సంఘ నేతలను  పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆచార్య ఆనందరావును రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

Read more