రేపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో సమావేశం

ABN , First Publish Date - 2021-01-26T18:27:43+05:30 IST

రేపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీఓలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వీడియో సమావేశం నిర్వహించనున్నారు.

రేపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ వీడియో సమావేశం

విజయవాడ: రేపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీఓలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వీడియో సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఎస్ఈసీ రమేశ్ కుమార్ జిల్లా కలక్టర్లు,ఎస్పీలతో చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆర్థిక, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖల కమీషనర్లు సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయితీ అధికారులు సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే సీఎస్ ఆడిత్యనాథ్ దాస్ ఈ సమావేశానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-01-26T18:27:43+05:30 IST