విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2021-01-21T16:14:39+05:30 IST
పౌరసరఫరాల శాఖ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్న నేథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
విజయవాడ: పౌరసరఫరాల శాఖ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్న నేథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బెంజిసర్కిల్లో వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ను మళ్లించారు. బెంజిసర్కిల్ సమీపంలోని స్కూల్స్, కళాశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.