హోం ఐసోలేషన్ వారికోసం ట్రై ఏజ్ సెంటర్
ABN , First Publish Date - 2020-07-11T12:44:04+05:30 IST
హోం ఐసోలేషన్ వారికోసం ట్రై ఏజ్ సెంటర్
విజయవాడ: కరోనా పాజిటివ్ కేసుల్లో హోం ఐసోలేషన్కు వెళ్లాలనే వారికి ట్రై ఏజ్ సెంటర్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులు అంచనా వేస్తారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. హోం ఐసోలేషన్ అనుమతులకు నగరంలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో ట్రై ఏజ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ప్రారంభంకానున్న ఈ సెంటర్ను కలెక్టర్ ఇంతియాజ్ శుక్రవారం పరిశీలించారు. ఇంట్లో ప్రత్యేక గది, టాయిలెట్ సదుపాయం ఉన్నది లేనిదీ కూడా పరిగణనలోకి తీసుకుంటారన్నారు. హోం ఐసోలేషన్ కోరే వారికి రోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.