గ్యాంగ్వార్ కేసులో కొనసాగుతున్న పోలీసుల విచారణ
ABN , First Publish Date - 2020-06-07T15:46:18+05:30 IST
గ్యాంగ్వార్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. సందీప్ గ్యాంగ్ను అదుపులోకి తీసుకుని మొత్తం 13మంది నిందితులను విచారిస్తున్నారు.
విజయవాడ: గ్యాంగ్వార్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. సందీప్ గ్యాంగ్ను అదుపులోకి తీసుకుని మొత్తం 13మంది నిందితులను విచారిస్తున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే గ్యాంగ్వార్కి కారణమని గుర్తించారు. ఘటనలో మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనలో పండు తల్లి పాత్రపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. పండు గ్యాంగ్ను రేపు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గుంటూరు జీజీహెచ్లో కోలుకున్న ప్రధాన నిందితుడు పండు రేపు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే పండును పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.