విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణం
ABN , First Publish Date - 2021-06-25T22:04:39+05:30 IST
విజయవాడ: నగరంలోని అగ్రహారంలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై..
విజయవాడ: నగరంలోని అగ్రహారంలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై హత్య జరిగింది. ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు కండ్రిగకు చెందిన రామారావుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీపుటేజినీ పరిశీలిస్తున్నారు. ఈ హత్య వెనుక రమేష్ అనే రౌడీ షీటర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలియవచ్చింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.