కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
ABN , First Publish Date - 2021-05-15T17:48:08+05:30 IST
కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం ముతరాసిపాలెం స్టేజి వద్ద మామిడి కోతకు వెళ్తున్న కూలీల ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
విజయవాడ: కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం ముతరాసిపాలెం స్టేజి వద్ద మామిడి కోతకు కూలీలను తీసుకువెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో మొత్తం 18 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. 14 మందిని విసన్నపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.