విజయవాడలో 100 పడకల కోవిడ్ సెంటర్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-15T19:14:20+05:30 IST
సుజనా ఫౌండేషన్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ప్రారంభించారు.
విజయవాడ: సుజనా ఫౌండేషన్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్ అనుబంధంగా ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 పడకలతో ఏర్పాటు చేశామని... 24/7 ఆక్సిజన్ పాటు వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభంతో కొంతమేర ప్రభుత్వాస్పత్రిపై భారం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వ వైద్యులతో పాటు కొంతమంది ప్రైవేట్ వైద్య సిబ్బంది కూడా ఇక్కడ వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.