ఈదురుగాలులతో నేల కూలిన అరటి తోటలు
ABN , First Publish Date - 2021-05-12T15:51:26+05:30 IST
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి బలమైన ఈదురుగాలులు వీచడంతో అరటి తోటలు నేల కూలాయి.
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంగళవారం రాత్రి బలమైన ఈదురుగాలులు వీచడంతో అరటి తోటలు నేల కూలాయి. మోపిదేవి మండలంలోని అరటి తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఈదురుగాలులకు మామిడి కూడా నేలరాలింది. అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని లంక తోటల్లో స్వల్ప నష్టం వాటిల్లింది. వర్షానికి పలుచోట్ల దాళవా ధాన్యం తడిసిపోయింది.