దుర్గగుడి వెండి సింహాల అదృశ్యం కేసులో పురోగతి
ABN , First Publish Date - 2020-10-01T22:01:05+05:30 IST
దుర్గగుడి వెండి సింహాల అదృశ్యం కేసులో పురోగతి లభించింది. జూన్ 26న రెండు వెండి సింహాల ప్రతిమలు మాయమైనట్లు...
విజయవాడ: దుర్గగుడి వెండి సింహాల అదృశ్యం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జూన్ 26న రెండు వెండి సింహాల ప్రతిమలు మాయమైనట్లు గుర్తించారు. జూన్ 29న మిగిలిన రెండు వెండి సింహాలు దొంగిలించే ప్రయత్నంలో మరో వెండి సింహం ప్రతిమ అదృశ్యం అయినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఇంటి దొంగలను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గగుడిలో పనులు చేసిన బిహార్ వారిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.