విజయశాంతి బీజేపీలో చేరుతున్నారు: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-12-06T00:24:59+05:30 IST

ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి సోమవారం బీజేపీలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు..

విజయశాంతి బీజేపీలో చేరుతున్నారు: బండి సంజయ్

హైదరాబాద్: ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి సోమవారం బీజేపీలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవి ఇస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. హైద్రాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారన్నారు. రెండు మూడు రోజుల్లో బీజేపీ కార్పొరేటర్లతో కలసి భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్తామని వెల్లడించారు. 2023లో అధికారంలోకి రావటమే తమ లక్ష్యమన్నారు.  ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే..  బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచేదని చెప్పారు. ‘‘ బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ముఖ్యమంత్రి తీరును మార్చుకోకుంటే ప్రజా  ఉద్యమాలు చేస్తాం. కేంద్రం నిధుల విషయంలో హైద్రాబాద్ అభివృద్ధికి సహకరిస్తాం. భూపేందర్ యాదవ్‌ను ఇంఛార్జ్ నియమించినప్పుడే మాకు గెలుస్తామన్న నమ్మకం కలిగింది. డీజీపీ, ఎన్నికల సంఘం, ఎంఐఎం టీఆర్ఎస్ ... అందరూ ఒక్కటే. రెండు డివిజన్లకే పరిమితమైన కాంగ్రెస్ నేతలకు బీజేపీని విమర్శించే అర్హత లేదు.’’ అని బండి సంజయ్ అన్నారు. 




Updated Date - 2020-12-06T00:24:59+05:30 IST