హుజురాబాద్ ఓటమితో కేసీఆర్కు భయం పట్టుకుంది: విజయశాంతి
ABN , First Publish Date - 2022-04-09T23:30:23+05:30 IST
సీఎం కేసీఆర్పై రాములమ్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఓటమి, 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో..
నిజామాబాద్: సీఎం కేసీఆర్పై రాములమ్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఓటమి, 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో.. కేసీఆర్కు భయం పట్టుకుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. శనివారం ఎడపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు విజయశాంతి హాజరై మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో 8 ఏళ్లుగా లేని సమస్య..ఇప్పుడే ఎందుకు వచ్చిందో రైతులు ఆలోచించాలని విజయశాంతి అన్నారు.