కేసీఆర్ గోల్మాల్ కథలు అందరికీ తెలిసినవే: విజయశాంతి
ABN , First Publish Date - 2022-08-18T00:15:34+05:30 IST
కేసీఆర్ గోల్మాల్ కథలు అందరికీ తెలిసినవే: విజయశాంతి
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. నిమ్స్లో కేసీఆర్ దొంగ దీక్ష ముచ్చట, ఢిల్లీలో దీక్ష పేరుతో గోల్మాల్ కథలు అందరికీ తెలిసినవేనని విజయశాంతి అన్నారు. కేసీఆర్ చెప్పేవి తుపాకి రాముడి కథలని ఆమె విమర్శించారు. కేసీఆర్ ఝూటా దీక్షకి.. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేదన్నారు. ప్రజలకు టోపీ పెట్టే సమర్థత కేసీఆర్ సొంతమన్నారు.