సైనికుల త్యాగాలను అనుమానించడం కేసీఆర్ మానసిక వైఫల్యానికి నిదర్శనం: విజయశాంతి

ABN , First Publish Date - 2022-02-16T03:37:52+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ బ‌ల‌ప‌డుతుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తట్టుకోలేక పోతున్నారని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.

సైనికుల త్యాగాలను అనుమానించడం కేసీఆర్ మానసిక వైఫల్యానికి నిదర్శనం: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ బ‌ల‌ప‌డుతుంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తట్టుకోలేక పోతున్నారని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. రోజూ బీజేపీపై బుర‌ద జ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారని, సర్జికల్ స్ట్రయిక్స్‌పై తనకూ అనుమానాలు ఉన్నాయనడం దారుణమన్నారు. మన సైన్యంపై దుష్ప్రచారం చేయడానికి కేసీఆర్ ఎందుకు తహతహలాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రయిక్‌కు వీడియోగ్రాఫిక్ సాక్ష్యం ఉన్నప్పటికీ, సాయుధ బలగాల పరాక్రమాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తూ.. అవమానిస్తున్నారని రాములమ్మ చెప్పారు. హుజూరాబాద్ బైపోల్ రిజల్ట్స్ తర్వాత కేసీఆర్‌లో వణుకు మొదలైందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పతనం మొదలైందని చెప్పారు. సైనికుల వీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడడం ఆయన మానసిక వైఫల్యానికి నిదర్శనమని విజయశాంతి విమర్శించారు.



Updated Date - 2022-02-16T03:37:52+05:30 IST