అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ సర్కారు చోద్యం చూస్తోంది: విజయశాంతి
ABN , First Publish Date - 2022-02-01T01:53:29+05:30 IST
హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.
హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. 2018 ఎన్నికల నేపథ్యంలో రైతులకు లక్షరూపాయల లోపు ఉన్న అన్ని పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ 97 శాతం క్రాప్ లోన్లు మాఫీ చేయకుండా వదిలేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర సర్కార్ రుణమాఫీ చేయకపోవడంతో తెలంగాణలో సుమారు 16 లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. గడువులోగా ఋణం చెల్లించక పోతే ఇళ్లకు తాళాలు వేస్తామని రైతులను బెదిరిస్తున్నారని, చివరికి ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర సర్కార్ మాత్రం చోద్యం చూస్తోందని ఆమె విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కారుకు పరాభవం తప్పదని విజయశాంతి చెప్పారు.
Vijayashanthi Senior BJP Leader