ఉపాధ్యాయులు 317 జీవో అనే పంజాలో చిక్కుకుని విలవిలాడుతున్నారు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-01-18T22:56:35+05:30 IST

హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు 317 జీవో అనే పంజాలో చిక్కుకుని విలవిలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.

ఉపాధ్యాయులు 317 జీవో అనే పంజాలో చిక్కుకుని విలవిలాడుతున్నారు: విజయశాంతి

హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు 317 జీవో అనే పంజాలో చిక్కుకుని విలవిలాడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తమకు ఆప్షన్ ప్రకారం బదిలీ చేయండని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ దుస్థితి రావడం అత్యంత హేయమన్నారు. బదిలీల కోసం ఉద్యోగులు పెట్టుకున్న ఆప్షన్లు, ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. దుర్మార్గపు నియంత పాలనను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతమొందించడం ఖాయమని విజయశాంతి జోస్యం చెప్పారు. 

Updated Date - 2022-01-18T22:56:35+05:30 IST