విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లు

ABN , First Publish Date - 2022-01-28T00:59:53+05:30 IST

హైదరాబాద్: బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 24 సంవత్సరాలు పూర్తై 25వ సంవత్సరం మొదలైంది.

విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లు

హైదరాబాద్: బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 24 సంవత్సరాలు పూర్తై 25వ సంవత్సరం మొదలైంది. 1998 జనవరి 26న తన రాజకీయ జీవితం మొదలైందని, ఈ సందర్భంగా ఆమె తనకు అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ఆదరాభిమానాలను ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానంటూ ఆమె ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో పెట్టారు. 



Updated Date - 2022-01-28T00:59:53+05:30 IST