అది ముమ్మాటికీ వనమా కుటుంబం చేసిన హత్యే: విజయశాంతి
ABN , First Publish Date - 2022-01-08T01:44:09+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబానికి ఎదురైన విషాద ఘటనపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్నప్పటికీ ప్రధాన నిందితుడైన వనమా రాఘవను ఇంతవరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. రామకృష్ణ కుటుంబానిది ఆత్మహత్య కాదని వనమా కుటుంబం చేసిన హత్యని విజయశాంతి ఆరోపించారు.