ఈ దాడి టీఆర్ఎస్ అరాచక పాలనకు నిదర్శనం: విజయశాంతి
ABN , First Publish Date - 2022-04-19T02:06:22+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై దాడి చేయడం టీఆర్ఎస్ అరాచక పాలనకు నిదర్శనమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై దాడి చేయడం టీఆర్ఎస్ అరాచక పాలనకు నిదర్శనమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సోమవారం రాములమ్మ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అధికార పార్టీ అరాచకాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయని మండిపడ్డారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా వచ్చి ప్రజాసంగ్రామ పాదయాత్రపై, బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ వారికి రక్షణగా నిలబడడం అత్యంత దారుణమని విజయశాంతి పేర్కొన్నారు.