తెలంగాణలో ‌రాష్ట్రపతి పాలన విధించాలి: విజయశాంతి

ABN , First Publish Date - 2022-04-11T19:57:54+05:30 IST

తెలంగాణలో ‌రాష్ట్రపతి పాలన విధిస్తేనే రైతులు బాగుపడతారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

తెలంగాణలో ‌రాష్ట్రపతి పాలన విధించాలి:  విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణలో ‌రాష్ట్రపతి పాలన విధిస్తేనే రైతులు బాగుపడతారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సోమవారం రాములమ్మ  మీడియాతో మాట్లాడుతూ.... బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.స్పెషల్‌ ఫ్లైట్స్‌లో పక్క రాష్ట్రాలకు తిరగడానికి డబ్బుంది కానీ.. పంట కొనడానికి కేసీఆర్‌ సర్కార్‌ దగ్గర డబ్బు లేదా? అని విజయశాంతి ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-11T19:57:54+05:30 IST