సీఎం రాజకీయాల నుంచి తప్పుకున్నారనుకుంటా?: విజయశాంతి
ABN , First Publish Date - 2021-01-19T21:49:48+05:30 IST
టీఆర్ఎస్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు.
హైదరాబాద్: టీఆర్ఎస్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నాశనమైందని విమర్శించారు. వాక్సినేషన్ సమయంలో ప్రతిఒక్కరికి ధైర్యం ఇవ్వాల్సిన సమయంలో సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదని ఆరోపించారు. రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకున్నారని అనుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
మంగళవారం హైదరాబాద్లో జరిగిన బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విజయశాంతి మాట్లాడుతూ వ్యాక్సినేషన్ సమయంలో ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన సీఎం ఫాంహౌస్ నుంచి బయటకు రాలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి అయితే బయటకు వస్తారని, ప్రజల సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. టీఆర్ఎస్లో సీఎం నుంచి కిందిస్థాయి నేత వరకు బూతులే మాట్లాడుతున్నారని విజయశాంతి విమర్శించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, స్థానిక నేతలు హాజరయ్యారు.