ఎంపీ విజసాయిరెడ్డికి చికిత్స అవసరమేమో!

ABN , First Publish Date - 2020-07-13T14:05:53+05:30 IST

వైసీపీలో రోజురోజుకి తన ప్రాభవాన్ని కోల్పోతుండటంతో డిప్రెషన్‌కిలోనై..

ఎంపీ విజసాయిరెడ్డికి చికిత్స అవసరమేమో!

టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి  


గుంటూరు(ఆంధ్రజ్యోతి): వైసీపీలో రోజురోజుకి తన ప్రాభవాన్ని కోల్పోతుండటంతో డిప్రెషన్‌కిలోనై మతి భ్రమించినట్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని ఆయనకు తక్షణ చికిత్స అవసరమని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యాన్ని జీర్ణించుకోలేని విజయసాయిరెడ్డి ఒక సైకోలా మారిపోయారని దుయ్యబట్టారు. ఆయనపై వైసీపీ నేతలకే అనుమానాలు ఉన్నాయన్నారు. అంబులెన్సుల నిర్వహణలో రూ.300 కోట్ల అవినీతికి పాల్పడ్డ ఆయన... నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎస్సీ సెల్‌ నాయకుడు విజయకిరణ్‌ విమర్శించారు. సమావేశంలో తెలుగు యువత నేత ఎల్లావుల అశోక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-13T14:05:53+05:30 IST