వైసీపీ అధికారంలో ఉండడానికి ప్రత్యేక హోదానే కారణం: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2022-02-08T01:09:13+05:30 IST

వైసీపీ అధికారంలో ఉండడానికి ప్రత్యేక హోదానే కారణం: విజయసాయిరెడ్డి

వైసీపీ అధికారంలో ఉండడానికి ప్రత్యేక హోదానే కారణం: విజయసాయిరెడ్డి

ఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం వైఖరి సరికాదని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కుంటిసాకులు చెప్తూ కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు. కేంద్రం ఏపీ నికర రుణ సేకరణ పరిమితిని తగ్గించడం రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమకు నిదర్శనమన్నారు. వైసీపీ అధికారంలో ఉండడానికి ప్రత్యేక హోదానే కారణమన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. హోదాపై వైసీపీ పోరాడడం లేదని ప్రతిపక్షాల దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విభజన చట్టంలో లేకున్నా ఉత్తరాఖండ్‌కు హోదా కల్పించారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీ యేతర రాష్ట్రాలకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2022-02-08T01:09:13+05:30 IST