విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-08-16T22:03:56+05:30 IST
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దు అంశంపై విజయసాయిరెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. పిటిషనర్ పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేశారని, పిటిషనర్పై సీబీఐ, క్రిమినల్ కేసులున్నాయని కౌంటర్లో విజయసాయి పేర్కొన్నారు. కౌంటర్పై వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గడువు కోరారు. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా పడింది.