విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి: విజయసాయిరెడ్డి
ABN , First Publish Date - 2021-07-12T23:19:47+05:30 IST
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి: విజయసాయిరెడ్డి
హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోరారు. అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్తానని ఆయన పేర్కొన్నారు. రెండు వారాలు అనుమతివ్వాలని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి పిటిషన్పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణ ఈ నెల 16కి సిబీఐ కోర్టు వాయిదా వేసింది.