Vijayanagaramలో రైల్వేస్టేషన్లకు భారీ భద్రత
ABN , First Publish Date - 2022-06-18T17:47:02+05:30 IST
అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైల్వేస్టేషన్లకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
విజయనగరం: అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైల్వేస్టేషన్లకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విజయనగరం, పార్వతీపురం రైల్వేస్టేషన్లలో భారీగా పోలీసులు మోహరించారు. రైల్వేస్టేషన్ లోపలకి వెళ్లే అన్ని రహదారులను ముళ్ల కంచెతో మూసివేశారు. పలు రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిసాకి చెందిన ఓ పెళ్లి బృందం పార్వతీపురంలో చిక్కుకుంది.