కరోనాతో విజయనగరం డిప్యూటీ మేయర్ నాగలక్ష్మి మృతి

ABN , First Publish Date - 2021-05-05T05:11:01+05:30 IST

నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి మంగళవారం కరోనా కారణంగా మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు...

కరోనాతో విజయనగరం డిప్యూటీ మేయర్ నాగలక్ష్మి మృతి

విజయనగరం: నగరపాలక సంస్ధ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి మంగళవారం కరోనా కారణంగా మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె కరోనా చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

వైసీపీ తరపున ఒకటవ డివిజన్ కార్పోరేటర్ గా ఎన్నికై డిప్యూటీ మేయర్ అయిన ముచ్చు నాగలక్ష్మి, పదవీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తి కాక ముందే మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు బాధతో కన్నీరు పెట్టుకుంటున్నారు.

Updated Date - 2021-05-05T05:11:01+05:30 IST