విజయనగరంలో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2022-03-07T14:43:57+05:30 IST
జిల్లాలోని గజపతినగరం మండలం రామన్నపేటలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది.
విజయనగరం: జిల్లాలోని గజపతినగరం మండలం రామన్నపేటలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కర్రలతో మంచాలు తయారు చేసే షేడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్తో పాటు ఓ పూరిల్లు అగ్నికి ఆహుతయ్యింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 8 లక్షల మేర ఆస్థి నష్టం వాటిల్లింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.