విజయనగరంలో విషాదం

ABN , First Publish Date - 2021-12-13T16:13:39+05:30 IST

జిల్లాలోని జమ్ము నారాయణపురంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీకై తల్లీ, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

విజయనగరంలో విషాదం

విజయనగరం: జిల్లాలోని జమ్ము నారాయణపురంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీకై తల్లీ, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను పట్టణంలోని మహారాజా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో తల్లి జి.దుర్గ(28), చిన్నారులు జి.గౌతమ్(7), జి.మానస(5)గా గుర్తించారు. తల్లి జి.దుర్గ(28) కుమార్తె, జి.మానస(5) పరిస్థితి విషమంగా ఉందని... దాదాపు 90 శాతం మేర శరీరం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-13T16:13:39+05:30 IST