పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతిరాజు

ABN , First Publish Date - 2021-10-18T14:08:33+05:30 IST

జిల్లాలో పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది.

పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతిరాజు

విజయనగరం: జిల్లాలో పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవస్ధాన అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యలు... పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. మహారాజ కోట నుండి యుద్ధ కళారూపాల ప్రదర్శనతో అశోక్ గజపతిరాజు కుటుంబం ఊరేగింపుగా వచ్చింది. అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు దేవస్ధాన మర్యాదలైన పూర్ణ కలశంతో వేద పండితులు, దేవస్ధాన అధికారులు స్వాగతం పలికారు. 

Updated Date - 2021-10-18T14:08:33+05:30 IST