విజయనగరంలో చిరుతపులి సంచారం

ABN , First Publish Date - 2022-04-13T16:35:08+05:30 IST

జిల్లాలోని మెంటాడ మండలం జయతి పరిసర గ్రామాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

విజయనగరంలో చిరుతపులి సంచారం

విజయనగరం: జిల్లాలోని మెంటాడ మండలం జయతి పరిసర గ్రామాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అటవీశాఖాధికారులు సేకరించారు. ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు నుండి పులి ప్రవేశించినట్టు గుర్తించారు. బీటు సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశామని, మెంటాడ, పాచిపెంట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2022-04-13T16:35:08+05:30 IST