కారు - ఆటో ఢీ... ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-02-25T14:15:50+05:30 IST

జిల్లాలోని సీతానగరం మండలం అంటిపేట దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు, ఆటో పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

కారు - ఆటో ఢీ... ఒకరు మృతి

విజయనగరం: జిల్లాలోని సీతానగరం మండలం అంటిపేట దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు, ఆటో పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి. బాడంగిలోని తమ బంధువు మృతి చెందారని పరామర్శకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-02-25T14:15:50+05:30 IST