విజయన్కు సీఎంగా కొనసాగే అర్హత లేదు: రమేశ్ చెన్నితల
ABN , First Publish Date - 2020-10-31T04:21:54+05:30 IST
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల పేర్కొన్నారు...
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి పదవికి విజయన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో సీపీఎం కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ కుమారుడు అరెస్ట్ కావడం అత్యంత ‘‘దురదృష్టకరమనీ..’’ ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెన్నితల పేర్కొన్నారు. ‘‘కేరళలో ప్రభుత్వమూ, అధికార పార్టీ రెండూ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. సీఎం సాధ్యమైనంత త్వరగా తన పదవికి రాజీనామా చేయాలి. ఆయన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జైల్లో ఉన్నారు. పార్టీ కార్యదర్శి కుమారుడు కూడా జైలుకు వెళ్లారు..’’ అని చెన్నితల గుర్తుచేశారు. ‘‘ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత ఆయనకు (విజయన్) లేదు. ఆయన చాలా సమస్యల్లో ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..’’ అని రమేశ్ చెన్నితల పేర్కొన్నారు.