ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలి

ABN , First Publish Date - 2021-09-30T21:15:11+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కోవిడ్ టీకాలు వేయించడం వల్ల వ్యాధికిపూర్తికి పూర్తిగా చెక్ పెట్టవచ్చని విజయా డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలి

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కోవిడ్ టీకాలు వేయించడం వల్ల వ్యాధికిపూర్తికి పూర్తిగా చెక్ పెట్టవచ్చని విజయా డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు.హైదరాబాద్ తార్నాక లోని విజయ డెయిరీ  కార్యాలయంలో  సిబ్బంది కి  100% కరోనా వాక్సినేషన్ కొరకు ఉచిత కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.


కరోనా వ్యాక్సిన్ వేయడం వల్ల ఉద్యోగులు కూడా ధైర్యంగా పని చేయగలుగుతారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టినా మళ్లీ రాకుండా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో విజయ డైరీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-30T21:15:11+05:30 IST