పురాతన విగ్రహాలు లభ్యం
ABN , First Publish Date - 2021-09-18T06:11:20+05:30 IST
మండలంలోని చిట్టాపురం గ్రామ సమీపంలో కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపగా శుక్రవారం పురాతన విగ్రహాల బయల్పడ్డాయి.
ఈపూరు, బాపట్లరూరల్, సెప్టెంబరు17: మండలంలోని చిట్టాపురం గ్రామ సమీపంలో కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపగా శుక్రవారం పురాతన విగ్రహాల బయల్పడ్డాయి. ఆలయం పైకప్పు, శ్రీకృష్ణుడు వేణువుతో ఉన్న విగ్రహం, మరో విగ్రహం లభ్యమైంది. గ్రామస్తులు విగ్రహాలను తీసుకు వచ్చి గ్రామంలో ఉంచారు.
సూర్యలంకతీరంలో..
బాపట్లమండలం సూర్యలంక సముద్రతీరంలో శుక్రవారం శ్రీరాముని రాత్రి విగ్రహం లభ్యమైంది. మెరైన్ పోలీసులు, పంచాయతీఅధికారులు సముద్రతీరానికి చేరుకొని శ్రీరాముని విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని ఆర్కేయాలజీ అధికారులకు సమాచారం అందించారు. అప్పటి వరకు విగ్రహాన్ని తమ వద్ద భద్రంగా ఉంచుతామని పంచాయతీ అధికారులు తెలిపారు.