ఘనంగా అభయాంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-10-26T03:50:05+05:30 IST

మండలంలోని కొమ్మలపూడి లో సోమవారం భారీ అభయాంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించారు. గ్రామానికి చెందిన

ఘనంగా అభయాంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠ
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠలో ఉభయదాతలు


 మనుబోలు, అక్టోబరు 25: మండలంలోని కొమ్మలపూడి లో సోమవారం  భారీ అభయాంజనేయుడి విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించారు. గ్రామానికి చెందిన కొండ్రెడ్డి పట్టాభిరామిరెడ్డి, కొండ్రెడ్డి వెంకట్రామిరెడ్డి దంపతులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. కింద భాగంలో రెండుఅడుగుల మేర స్వామి వారి శిలావిగ్రహాన్ని ప్రతి ష్థించారు. విజయవాడకు చెందిన దీవి హరినవీన్‌ స్వామి ఆధ్వర్యంలో బుత్విక్కులు వేదమంత్రాలతో శాస్త్రోపేతంగా ప్రతిష్ఠపూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ, తీర్థ,ప్రసాదాలు అందజేశారు. ప్రతిష్ఠ కార్యక్రమా లను మన్నెమాల శేషారెడ్డి, సిద్దపరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మురళీధ ర్‌రెడ్డి,  శ్రీనువాసులురెడ్డి, గూడలి శ్రీనువాసు లురెడ్డి తదితరులు పర్యవేక్షించారు. 


Updated Date - 2021-10-26T03:50:05+05:30 IST