జోరుగా రంగురాళ్ల తవ్వకాలు

ABN , First Publish Date - 2022-09-27T06:43:35+05:30 IST

కూటికొండలు అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. గత ఏడాది ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నట్టు పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పరిశీలించి అడ్డుకున్నారు.

జోరుగా రంగురాళ్ల తవ్వకాలు
కూటికొండలుపై రంగురాళ్ల తవ్వకాలు చేపడుతున్న కూలీలు

కూటికొండలుపై కోలాహలం

పట్టించుకోని అధికారులు


జి.మాడుగుల, సెప్టెంబరు 26: కూటికొండలు అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. గత ఏడాది ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నట్టు పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పరిశీలించి అడ్డుకున్నారు. తవ్వకాలు జరపకుండా చర్యలు తీసు కున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో నర్సీపట్నం, రావికమతం, దిబ్బూరు ప్రాంత వ్యాపారులు స్థానిక గిరిజన కూలీలతో గుట్టుచప్పడు కాకుండా రోజూ తవ్వకాలు చేపడుతున్నారు. సోమవారం కూడా ఈ తవ్వకాలు కొనసాగాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2022-09-27T06:43:35+05:30 IST