జోరుగా వరి నాట్లు
ABN , First Publish Date - 2022-07-04T04:59:55+05:30 IST
యాచారం మండలంలో వరి నాట్ల పనులు
యాచారం మండలంలో వరి నాట్ల పనులు జోరందుకున్నాయి. ఇంతవరకు భారీ వర్షాలు కురవకున్నా గ్రామాల్లో వారం పది రోజులుగా రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మున్ముందు భారీ వర్షాలు కురుస్తాయన్న ఆశతో వరి నాట్లు వేస్తున్నారు. వర్షాలు కురిస్తే వరి సాగు మరింత పెరిగే అవకాశముంది.
- యాచారం