విజిలెన్స్ బృందం ఆకస్మిక తనిఖీలు
ABN , First Publish Date - 2020-07-12T09:53:00+05:30 IST
జిల్లాకేంద్రం గుంటూరు పట్నంబజారులోని ఎరువుల దుకాణాల్లోని బస్తాల్లో తూకం తగ్గుతున్నట్లు విజిలెన్స్ టాస్క్ఫోర్స్
బస్తాల తూకంలో ఎరువు తగ్గుదల
గుంటూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం గుంటూరు పట్నంబజారులోని ఎరువుల దుకాణాల్లోని బస్తాల్లో తూకం తగ్గుతున్నట్లు విజిలెన్స్ టాస్క్ఫోర్స్ అధికారులు నిర్ధారించారు. 50కిలోల బస్తాలో 49 కిలోల ఎరువు ఉన్నట్లు తేలింది. పట్నంబజారులోని పలు ఎరువుల దుకాణాల్లో శనివారం తూనికలు, కొలతలశాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్ టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలుచేసింది.
పలుషాపుల్లో బస్తాలను తూకంవేయగా ఒకటి రెండు కిలోలు తక్కువ ఉండడాన్ని గుర్తించారు. ఈ మేరకు జేసీకి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. దాడుల్లో తూనికలు, కొలతలశాఖ ఏసీ అల్లూరయ్య, సీఎస్డీటీ రమేష్, డీసీటీవో హరికృష్ణ, ఏపీ స్టేట్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చదలవాడ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.