పర్యాటక ప్రాంతాల్లో విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2022-07-06T06:20:17+05:30 IST
పర్యాటక ప్రాంతాల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు వస్తువులు విక్రయిస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఎస్పీ స్వరూపారాణి ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు.
15 దుకాణాలపై కేసులు నమోదు
విశాఖపట్నం, జూలై 5: పర్యాటక ప్రాంతాల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు వస్తువులు విక్రయిస్తున్నారని అందిన ఫిర్యాదుల మేరకు ఎస్పీ స్వరూపారాణి ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే కైలాసగిరి, తెన్నేటిపార్క్, వుడా పార్క్, ఆర్కేబీచ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు వస్తువులు అమ్ముతున్నట్లు నిర్థారించుకుని పదిహేను దుకాణాలపై కేసులు నమోదుచేసి జరిమానా విధించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ విభాగం సీఐ జి.కోటేశ్వరరావు, ఏజీ రామారావు తదితరులు పాల్గొన్నారు.