మంచిప్పలో విజిలెన్స్ అధికారి తనిఖీలు
ABN , First Publish Date - 2020-07-05T11:22:06+05:30 IST
మండలంలోని మంచిప్ప గ్రామంలో జరుగుతున్న ప లు అభివృద్ధి పనులను విజిలెన్స్ అధికారి ఎం.నారాయణ శనివారం తనిఖీ చే శారు
మోపాల్, జూలై 4: మండలంలోని మంచిప్ప గ్రామంలో జరుగుతున్న ప లు అభివృద్ధి పనులను విజిలెన్స్ అధికారి ఎం.నారాయణ శనివారం తనిఖీ చే శారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఉపకేంద్రంతోపాటు గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దుబాయి నుంచి గ్రామానికి ఎంతమంది తిరిగి వచ్చారు? వారు ఇంట్లోనే ఉండే విధం గా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అని ఆరా తీశారు. విజిలెన్స్ అధికా రి వెంట ఎంపీడీవో మల్లేశం, సర్పంచ్ సిద్దార్థ, గ్రామస్థులు ఉన్నారు.