ఉర్దూ లైబ్రరీలో విజిలెన్స్ తనిఖీలు
ABN , First Publish Date - 2020-02-20T06:41:58+05:30 IST
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం నిడదవోలు పట్టణంలోని జెండాల వీధిలో ఉన్న ఉర్దూ లైబ్రరీలో జిల్లా విజిలెన్స్
3 గంటల పైగా రికార్డుల పరిశీలన
నిడదవోలు, ఫిబ్రవరి 19: జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం నిడదవోలు పట్టణంలోని జెండాల వీధిలో ఉన్న ఉర్దూ లైబ్రరీలో జిల్లా విజిలెన్స్ తహసీల్దార్ పి.రవికుమార్, విజిలెన్స్ ఎస్ఐ కె.ఏసు బాబు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ తహసీల్దార్ పి.రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఉర్దూ లైబ్రరీ నిర్వహణ తీరు తెన్నులపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకే రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. పరిశీలించిన అనంతరం జిల్లా అధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. సుమారు మూడు గంటలకు పైగా ఉర్దూ లైబ్రరీ రికార్డులను అధికారులు పరిశీలించారు.